చంద్రబాబు మునిగిపోయే పడవ

సామినేని ఉదయభాను
విజయవాడ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిట్టి నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో సామినేని మాట్లాడారు. చంద్రబాబు మునిగి పోయే పడవ అన్నారు. ఈ రాష్ట్రానికి మంచి నాయకుడు కావాలని, ప్రత్యేక హోదా తెచ్చే దమ్మున్న నాయకుడు కావాలన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తామని చెప్పారు. వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపరిచి, చంద్రబాబు అడ్రస్‌ గల్లంతు చేద్దామన్నారు. జలీల్‌ఖాన్‌ ఓ అసమర్ధుడు, ఆయన బీకాం చదివాడు..ఆయనకు బీకాంలో ఫిజిక్స్‌ చదివాడని ఎద్దేవా చేశారు. నీలాంటి అవినీతిపరుడు విజయవాడ ఎమ్మెల్యే కావడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టమన్నారు. 
 
Back to Top