<p class="rtejustify" style="" margin-top:0cm=""><strong>కృష్ణా:</strong> వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 160 రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర ఆదివారం ఉదయం కైకలురు శివారు నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కాకతీయ నగర్, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడ లంక మీదుగా మణుగులూరు చేరుకొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. మధ్యాహ్నం ఏలూరు మండలంలోని కాలకర్రు గ్రామం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. అటు నుంచి మహేశ్వర పురం వరకు పాదయాత్ర చేయనున్నారు. </p>