<br/>నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేటికి 87వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ తన పాదయాత్రను ఉదయగిరి నియోజకవర్గం, కలిగిరి మండలం, కలిగిరి శివారు నుంచి ప్రారంభించారు. ఉదయాన్ని శిబిరం వద్దకు చేరుకున్న ప్రజలతో వైయస్ జగన్ కాసేపు మాట్లాడి ముందుకు కదిలిరు. కాగా జననేత ఈ రోజు కృష్ణారెడ్డిపాళెం, కుడుముల దిన్నెపాడు, తాళ్లపాడు క్రాస్, చిన్న అన్నలూరు, కొండాపురం మండలం మామిడాల పాళెం మీదుగా జంగాలపల్లి వరకు పాదయాత్ర చేయనున్నారు.