అనంతపురం: ఎమ్మెల్యే చాంద్బాషా అభివృద్ధి కోసం పార్టీ మారినా అని చెప్పారని, ఇంతవరకు ఆయన చేసిన ఘన కార్యమేమైనా ఉందా అని మాజీ మంత్రి మహమ్మద్ షాకీ ప్రశ్నించారు. టీడీపీ నేతలు పర్సెంటేజ్ల కోసం పోట్లాడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని తెలిపారు. మనమంతా వైయస్జగన్ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్ జగన్ కదిరిలో ఎవరికి ఎమ్మెల్యే సీటు ఇచ్చినా అందరం కలిసి పనిచేద్దామన్నారు.