<br/>తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని శ్రీకాకుళం, విశాఖ మత్స్యకారులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, చేపల వేట విరామ సమయంలో డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటానని మాట ఇచ్చారు. వైయస్ జగన్ హామీతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ వెంటే ఉంటామని నినదించారు.