శ్రీకాకుళంః సర్వశిక్షాభియాన్ ఉద్యోగులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారన్నారు.తమకు పనిభారం ఎక్కువయిందని,సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పనికితగ్గ వేతనం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.హెచ్ఆర్ పాలసీ వర్తింపు చేస్తామని హామీ ఇచ్చిన నేటికి అమలు కాలేదని వాపోయారు.కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని వైయస్ జగన్ను కోరారు. బిఇడి,టెట్లు అర్హత సంపాదించి ఎక్స్పీరియన్స్ సర్వీస్తో ఉద్యోగాలు పొందామన్నారు.స్కూల్ అసిస్టెంట్ కేటగిరికి సమానంగా ఉన్న వారితో సమాన వేతనం లేదన్నారు.వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత మాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు.