<strong>వైయస్ జగన్ సీఎం కావాలని ముస్లిం సోదరుల ప్రార్థనలు</strong>శ్రీకాకుళంః చంద్రబాబు మైనారిటీ ద్రోహి అని, వైయస్ఆర్ వల్లే మైనార్టీలకు న్యాయం జరిగిందని మైనార్టీ సోదరులు అన్నారు.ముస్లింలు హక్కుల కోసం పోరాడితే అణిచివేత చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ను కలిసి వైయస్ జగన్ సీఎం కావాలని, ఆరోగ్యంగా ఉండాలని పాదయాత్ర విజయవంతంగా జరగాలని ప్రార్థనలు నిర్వహించారు. మక్కా నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక జలాన్ని వైయస్ జగన్కు ఇచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతారనే నమ్మకం ఉందన్నారు.చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నిన జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, మైనార్టీ సోదరులంతా వైయస్ జగన్కు అండగా ఉన్నామన్నారు.