ముత్యాలంపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

కృష్ణా : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా జిల్లా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు రాజన్న బిడ్డతో కలిసి అడుగులేస్తున్నారు. ప్రత్యేక హోదాకు మద్ధతుగా సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించగా, మంగళవారం 138వ రోజు వైయ‌స్ జ‌గ‌న్ ముత్యాలంపాడు శివారు నుంచి   పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్క‌డి నుంచి ఆత్కూరు, మీదుగా చెవుటూరు చేరుకుంటారు.  మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కుంటముక్కల క్రాస్‌, గుర్రాజు పాలెం మీదుగా మైలవరం చేరుకొని బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్  ప్రసంగిస్తారు 

తాజా వీడియోలు

Back to Top