కందుకూరు ఇంచార్జ్ టి. మాధవరావు గూడ్లురు మండలం బసిరెడ్డి పాలెం పంచాయితీ లోని చెంచిరెడ్డి పాలెంలో గడప గడపకు వైయస్సార్ సిపి కార్యక్రమం నిర్వహించారు. ప్రజా బ్యాలెట్ ద్వారా చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మాట మార్చారో ప్రజలకు వివరించారు. బాబు పాలనపై ప్రజలు మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు తమ ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.<br/>