<br/>పుష్కరాల తొక్కిసలాటకు చంద్రబాబుదే ప్రధాన బాధ్యత అని పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ ఘటన తీవ్రంగా కలిచి వేసిందని ఆయన రాజమండ్రి లో అన్నారు. అన్ని సమయాల్లో బాధితులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటి దాకా బాధ్యుల మీద చర్యలు తీసుకోక పోవటం దారుణం అని ఆయన అభిప్రాయ పడ్డారు.