చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సమైక్య ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం
28 Nov 2013 3:36 PM
అనంతపురము, 28 నవంబర్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సమైక్య ఉద్యమాలు మరింతగా తీవ్రతరం చేస్తామని పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి తెలిపారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్న తమ పార్టీ త్వరలో సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేపడుతుందని గుర్నాథ్రెడ్డి తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎంపీల చేతగానితనం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు ఓట్లు-సీట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న అశేష ప్రజాదరణ చూసి కాంగ్రెస్, టీడీపీలు ఓర్వలేకపోతున్నాయన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్యవాదో..? విభజనవాదో తేల్చాలని గుర్నాథ్రెడ్డి డిమాండ్ చేశారు.