‌సమైక్య ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం

అనంతపురము, 28 నవంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో సమైక్య ఉద్యమాలు మరింతగా తీవ్రతరం చేస్తామని పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి తెలిపారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చే‌స్తున్నాని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్న తమ పార్టీ త్వరలో సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేపడుతుందని గుర్నాథ్‌రెడ్డి తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎంపీల చేతగానితనం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు ఓట్లు-సీట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి వస్తున్న అశేష ప్రజాదరణ చూసి కాంగ్రెస్, టీడీపీలు ఓర్వలేకపోతున్నాయన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్యవాదో..? విభజనవాదో తేల్చాలని గుర్నాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top