ముమ్మాటికి హత్యాయత్నమే...

ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని చంద్రబాబు చాలా చిన్న ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. డీజీపీ వ్యాఖ్యలు కూడా బాధ్యతరాహిత్యంగా ఉన్నాయన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఉన్న ఒక ప్రధానమైన అంశాన్ని  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రిపోర్ట్‌ ప్రకారం వైయస్‌ జగన్‌ను అంతమొందించడానికే హత్యాయత్నం జరిగిందని స్పష్టమవుతుందన్నారు. ఈ అంశంపై రాజ్‌నాథ్‌ స్పందించారన్నారు.

Back to Top