కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రేపటి బంద్కు అందరూ మద్దతివ్వాలి
23 Jul 2018 12:14 PM
విజయవాడ: ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 24న వైయస్ఆర్సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్కు అన్ని పార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్దతివ్వాలని వైయస్ఆర్సీపీ నాయకుడు మల్లాది విష్ణు కోరారు. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే బంద్లో భాగస్వామి కావాలని హితవు పలికారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం హోదాను తుంగలో తొక్కారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా హోదా విషయంలో మోసం చేశారని మండిపడ్డారు. హోదా కోసం వైయస్ జగన్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాతోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసినా వైయస్ఆర్సీపీ మద్దతిస్తుందని చెప్పారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని సూచించారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తే కచ్చితంగా హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.