అనంతపురం: అనంతపురం జిల్లాలో మరోమారు దారుణం జరిగింది. ధర్మవరం మండలం బడనపల్లి సమీపంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెన్నారెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. వ్యవసాయ పనులు పర్యవేక్షిస్తుండగా ప్రత్యర్థులు చెన్నారెడ్డిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. చెన్నారెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేశారు.