వైయస్ఆర్ జల్లాః ప్రత్యేకహోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని,గత నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా కోసం పోరాడి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని వైయస్ఆర్సీపీ నేత వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రజల్లో డిమాండ్ పెరిగేకొద్ది ప్రత్యేకహోదాపై చంద్రబాబు చేసేదేమిలేక యూటర్న్ తీసుకున్నారన్నారు. పార్లమెంట్లో కూడా వైయస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి వైయస్ఆర్సీపీ ఎంపీలు పదవులకు కూడా రాజీనామాలు చేశారన్నారు.