<br/>అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కల్లుమడి గ్రామంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్సీపీ జెండాను ఎగురవేశారు. గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన జననేత గ్రామ కూడలిలో అశేష జనవాఃహిణి నడుమ పార్టీ జెండా ఎగురవేసి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. త్వరలోనే మనందరి ప్రభుత్వం వస్తుందని, ఎవరు అధైర్య పడోద్దని ప్రజలకు భరోసా కల్పించారు.