ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు

అమరావతి: నాలుగేళ్ల చంద్బరాబు పాలన ఓ విధ్వంసమని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

– ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో విద్రోహం..యువతకు ఉద్యోగాలు లేవు
– రైతుల రుణాలను, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయలేదు
– ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు.
– విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్లక్ష్యం చేశారు
– పేదలకు గృహాలను నిర్మించలేదు
– ఇంధన ధరల్లో ఎలాంటి ఊరట ఇవ్వలేదు
– అన్నింటా అవినీతి చెలరేగింది
– ఇచ్చిన హామీల్లో వేటిని నెరవేర్చలేదు
– ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు
– కేవలం గొప్పలు చెప్పుకున్నారు
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఓ విధ్వంసంగా సాగింది.
– రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని వైయస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

 
Back to Top