అమరావతి: నాలుగేళ్ల చంద్బరాబు పాలన ఓ విధ్వంసమని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని వైయస్ఆర్సీపీ అధ్యక్షలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా వైయస్ జగన్ ట్వీట్ చేశారు.<strong><br/></strong><strong>– ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో విద్రోహం..యువతకు ఉద్యోగాలు లేవు</strong><strong>– రైతుల రుణాలను, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయలేదు</strong><strong>– ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు.</strong><strong>– విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేశారు</strong><strong>– పేదలకు గృహాలను నిర్మించలేదు</strong><strong>– ఇంధన ధరల్లో ఎలాంటి ఊరట ఇవ్వలేదు</strong><strong>– అన్నింటా అవినీతి చెలరేగింది</strong><strong>– ఇచ్చిన హామీల్లో వేటిని నెరవేర్చలేదు</strong><strong>– ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు</strong><strong>– కేవలం గొప్పలు చెప్పుకున్నారు</strong><strong>– నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఓ విధ్వంసంగా సాగింది.</strong><strong>– రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని వైయస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. </strong><strong><br/></strong><strong> </strong>