ఎంపీలతో కలిసి మెట్రో రైల్లో వైయస్ జగన్ ప్రయాణం

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం మెట్రో రైలులో ప్రయాణించారు. విమానాశ్రయం మెట్రో ఎక్స్‌ప్రెస్ మార్గం నుంచి ఆయన శివాజీ స్టేడియం స్టేషన్‌ వరకూ రైలులో ప్రయాణం చేశారు. అక్కడ నుంచి కారులో ప్రధానమంత్రిని కలిసేందుకు వెళ్లారు. వైయస్‌ జగన్‌ వెంట పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డి , అవినాష్ రెడ్డి ఉన్నారు. 

Back to Top