కుమ్మరులకు అండగా ఉంటా




విజయనగరం: కుమ్మరులకు అన్ని విధాల అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర 295వ రోజు విజయనగరం జిల్లా పాయకపాడు నుంచి ప్రారంభం కాగా, మేలపువలసలో జననేత వైయస్‌ జగన్‌ను కుమ్మరులు కలిసి తమ సమస్యలను వివరించారు.  ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ కుమ్మరి చక్రాన్ని తిప్పి వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. సంకల్పమే ఊపిరిగా ప్రజా సంకల్ప యాత్ర ముందుకు సాగుతోంది. జననేత రాకతో పాదయాత్ర దారుల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాజన్న బిడ్డను చూడాలని, కరచాలనం చేయాలని ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలికారు. 
 
Back to Top