<br/>హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ను స్మరిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. దేశంలో ప్రజాస్వామిక విలువలకు పునాది వేస్తూ.. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అని ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేద్దామంటూ ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. <br/><br/>