హోదా సాధించేదాకా పోరాటం ఆగదు


ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై మొట్ట మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం అనేక రకాల పోరాటాలు చేశామని గుర్తు చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా అనంతరం వైయస్‌ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యులంతా రాజీనామాలు చేస్తారన్నారు. రాజీనామాలు చేయడమే కాకుండా ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటారన్నారు. 
Back to Top