ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
తుక్కుగూడ నుంచి మొదలైన షర్మిల పాదయాత్ర
13 Dec 2012 1:49 PM
తుక్కుగూడ (రంగారెడ్డి జిల్లా), 13 డిసెంబర్ 2012: శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 57వ రోజు గురువారంనాడు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ నుంచి ప్రారంభమైంది. వేలాది అభిమానులు వెంటరాగా ఆమె ముందుకు కదిలారు. అక్కడి నుంచి శ్రీమతి షర్మిల రావిరాల చేరుకుంటారు. రావిరాలలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత ఆదిభట్ల చేరుకుంటారు. అనంతరం నాదర్గుల్ వరకూ నడిచి అక్కడ రచ్చబండ నిర్వహిస్తారు. రాత్రికి నాదర్గుల్లో బస చేస్తారు.
ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. శ్రీమతి షర్మిల గురువారం 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.