నేడు రాష్ట్రపతిని కలవనున్న వైయస్‌ఆర్‌సీపీ బృందం..



ఢిల్లీః  నేడు రాష్ట్రపతిని వైయస్‌ఆర్‌సీపీ నేతల బృందం కలవనుంది. సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని వివరించనున్నారు. కేంద్ర సంస్థతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు,సీనియర్‌ నేతలు కోరనున్నారు.
 
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై గ‌త నెల 25వ తేదీ విశాఖ ఎయిర్ పోర్టులో హ‌త్యాయ‌త్నం జ‌రిగిన విష‌యం విధిత‌మే. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ వ్యవహరించిన తీరు సరిగా లేదని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఇదివ‌ర‌కే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు ఫిర్యాదు చేశారు.  ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు కనీసం వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు.  పైపెచ్చు వైయ‌స్ఆర్‌సీపీ పైనే నింద వేసే ప్రయత్నం చేశారు. వైయ‌స్  జగన్‌ జాగ్రత్త పడకపోయి ఉంటే ఆ రోజు ఆయన ప్రాణాలకే ముప్ఫు ఏర్పడేది. ఈ దాడి విషయంలో చంద్రబాబు కనీసం సానుభూతి కూడా తెలపలేదు. అలిపిరి ఘటన జరిగినపుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖర్‌ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి తిరుపతి వచ్చి చంద్రబాబును పరామర్శించారు. కానీ వైయ‌స్ జగన్‌ విషయంలో చంద్రబాబు హుందాగా వ్యవహరించలేదు. సిట్‌ విచారణ తీరు సరిగా లేదు. ప‌లు అనుమానాలకు తావిస్తోంది. అందుకే సీబీఐ చేత విచారణ చేయాలని పార్టీ నేత‌ల బృందం రాష్ట్ర‌ప‌తిని కోర‌నున్నారు. 
Back to Top