చిత్తూరు: చిత్తూరు జిల్లా మంగలిపట్టు గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేత దిలిప్ నాయుడు వర్గీయులు దాడి చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి సంబంధించిన బ్యానర్లు కడుతుండగా టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దళితుడు అని చూడకుండా అధికార పార్టీ నేతలు దుర్భషలాడారు. టీడీపీ నేతల తీరును వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది.