మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సోమసుందర్ మరణం బాధాకరం
12 Aug 2016 4:43 PM
హైదరాబాద్ః స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ కవి, అభ్యుదయ వాది అవంత్స సోమసుందర్ మరణం బాధాకరమని వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహాకవులలో సోమసుందర్ ఒకరని ఆయన పేర్కొన్నారు. తెలుగు సాహిత్యానికి ఆణిముత్యాలను అందించారని, 80 పుస్తకాల ద్వారా తెలుగునేల మీద కురిపించిన భావాలు తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశాయన్నారు.
నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాట సమయంలో ఆయన రచించిన కవితల సంకలనం వజ్రాయుధం తెలుగునాట చిరస్మరణీయంగా నిలిచిపోయాయని వైయస్ జగన్ గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.