ఖమ్మం/ ఏలూరు: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులా చూసుకుంటారని శ్రీమతి వైయస్ విజయమ్మ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేశారు. అయితే పేదలు బతకడానికి అభివృద్ధి కూడా కావాలన్నారు. కూడు, గూడు, గుడ్డ, ఆరోగ్యం అన్ని వసతులూ కల్పించాలన్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారని ఆమె గుర్తుచేశారు. శ్రీ జగన్మోహన్రెడ్డి కూడా తండ్రిలానే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పేదలకు సేవ చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నారని శ్రీమతి విజయమ్మ చెప్పారు. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ప్రచారంలో భాగంగా రెండవ రోజు మంగళవారం ఆమె కొత్తగూడెం, సత్తుపల్లిలలో పర్యటించి, పలుచోట్ల ప్రసంగించారు. ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్షో నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో ప్రజలను ఉద్దేశించి శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు.శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సంతోషంలో, బాధల్లో, కష్టాలు, కన్నీళ్లలో పాలుపంచుకుంటారని శ్రీమతి వైయస్ విజయమ్మ భరోసా ఇచ్చారు. రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మనసున్న నాయకులనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇచ్చే నాయకులకే పట్టం కట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.