గతంలో గోబెల్సు .. ఇప్పుడు రామోజీ

గుంటూరు:

గతంలో జర్మనీ నియంత హిట్లర్ తరఫున గోబె‌ల్సు ఎలా అబద్ధ ప్రచారాలు చేసి జనాన్ని మోసగించారో... ఇప్పుడు చంద్రబాబు తరపున రామోజీరావు అలాగే తయారయ్యారని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోతుంటే... విజయాల మీద విజయాలు సాధిస్తుందంటూ అబద్ధాలు ప్రచారం చేయడానికి గోబెల్సు అనే ఓ మంత్రిని హిట్లర్ పెట్టుకున్నారట‌ అన్నారు. చంద్రబాబు కూడా ఆయన అబద్ధాలను ప్రచారం చేయడానికి రామోజీరావు అనే అభినవ గోబెల్సును పెట్టుకున్నారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా నకరికల్లు, శిరిగిరిపాడు, గురజాలలో బుధవారం నిర్వహించిన వైయస్ఆర్ జనభేరి‌ ఎన్నికల ప్రచార సభల్లో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

'రాష్ట్రం తగలబడిపోతున్నా, కాంగ్రెస్‌ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నా వారికేం పట్టదు. రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే వారి పని. జగన్మోహన్‌రెడ్డిపై పేజీలకు పేజీలు అబద్ధాలు రాయడమే వారి ఉద్యోగం. విచిత్రంగా చంద్రబాబుకూ హిట్లర్‌కూ చాలా దగ్గరి పోలికలున్నాయి. ఇద్దరూ ఏప్రిల్ 20 తేదీనే పుట్టారు. హిట్లర్‌లానే చంద్రబాబూ నియంత... బెదిరిస్తూ మాట్లాడతాడు’ అని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. ‘మరోవైపు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు కాదనుకున్నాడు జగనన్న. విలువలు విశ్వసనీయతే ముఖ్యమనుకున్నాడు. ఆఖరికి చెయ్యని నేరానికి జైలుకు కూడా వెళ్ళాడు. అయినా చెరగని ఆత్మవిశ్వాసంతో బోనులో ఉన్నా సింహం సింహమేనని నిరూపించుకున్నాడు. అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా’ అని ప్రజలకు శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.

రామోజీరావు... ఓ 420 :
'రామోజీరావు స్వార్థం కోసం రంగులు మార్చేస్తున్నారు. ఆయనో పెద్ద భూబకాసురుడు. రామోజీ ఫిల్ముసిటీ కోసం ప్రభుత్వ భూములను మింగేశారు. అసైన్డు భూముల్నీ మింగేశారు. ఆఖరికి గ్రామాలకు గ్రామాలు సైతం మింగేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం రామోజీరావు. ఈనాడు పత్రికకు రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా ఏదైనా భూమిని లీజుకు ఇస్తే అది వెనక్కిచ్చిన దాఖలాలు లేవు. ఆదిత్యవర్మ అని విశాఖపట్నంలో ఒకాయన రూ.130 కోట్ల విలువ చేసే భూమిని రామోజీరావుకు లీజుకు ఇస్తే ఆయనను నానారకాలుగా హింసించారు రామోజీరావు. ఆఖరికి ఆయన భూమిని 800 గజాలు ప్రభుత్వం రోడ్డు విస్తరణ కింద తీసుకుంటే రామోజీరావు ఆ స్థలం తనదని తప్పుడు నివేదికలిచ్చి పరిహారం కాజేశారు. దీనిపై 420 కేసు కూడా పెట్టారు' అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.

'మార్గదర్శి ఫైనాన్షియర్సు ద్వారా రూ.2,600 కోట్ల డిపాజిట్లు అక్రమంగా సేకరించి, ఆస్తులు కూడబెట్టుకున్నారని, స్వయంగా రిజర్వుబ్యాంక్ ఆ‌ఫ్ ఇండియానే హైకోర్టుకు చెప్పింది. సినిమా‌లు, సీరియళ్ళు తీసి మళ్ళీ ఆయనే వాటిని కొనుక్కున్నట్లు రూ. 800 కోట్లకు తప్పుడు లెక్కలు చూపిస్తే.. ఇవి దొంగలెక్కలని ఇన్‌కమ్‌టాక్సు డిపార్టుమెంట్ ఆయన మీద కేసు కూడా పెట్టింది.‌ కళాంజలి అనే ఒక దుకాణం పెట్టి పురాతన వస్తువులను స్మగ్లింగ్ చే‌సి అమ్ముకుంటున్నారని ఢిల్లీలో ఆర్కియాలజీ శాఖ కేసు పెట్టింది. మొత్తమ్మీద రామోజీరావు మీద 200 కేసులు ఉన్నాయి. హైకోర్టు చరిత్రలోనే ఒక మనిషి మీద ఇన్నేసి కేసులు ఉండటం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు' అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

'స్వయానా తోడల్లుడైన అప్పారావునే రామోజీరావు ముంచేశాడు. లంకా దహనం ఎలా అయిందో అలాగే ఒకరోజు రామోజీ దహనం కూడా జరగడం ఖాయమని అప్పారావు తల్లి రామోజీరావుకు శాపనార్థాలు కూడా పెట్టారు. ఆయనకు బంధువులు, మానవత్వం పట్టవు... వట్టి డబ్బు మనిషి. ఒంట్లో ఉన్న కేన్సర్‌ను అధిగమించగలం కానీ ఇంట్లో ఉన్న కేన్సర్‌ను ఎలా అధిగమిస్తామని రామోజీరావు కన్న కొడుకు సుమన్‌ తన తండ్రి తీరును దుయ్యబట్టారు. అడుగడుగునా అవినీతిలో కూరుకుపోయిన రామోజీరావు అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత అసహ్యంగా ఉంది' అని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు.

చంద్రబాబును మించిన సైకో ఇంకెవరు? :
'పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు సైకో చంద్రబాబుకు అందరూ సైకోల్లా కనిపిస్తున్నారు. సొంత మామను చెప్పులతో కొట్టించిన చంద్రబాబుకు మించిన సైకో ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? విద్యుత్‌ చార్జీలు తగ్గించాలంటూ రైతులు ఉద్యమిస్తే పిట్టల్లా కాల్చి చంపించిన సైకో చంద్రబాబు. జీతాలు పెంచమని అడిగిన అంగన్‌వాడీ ఆడపడుచులను గుర్రాలతో తొక్కించిన సైకో చంద్రబాబు. గ్రామంలో పింఛన్ అందుకుంటున్న వారిలో ఒకరు మరణిస్తేనే ఆ స్థానంలో వేరొకరికి పింఛ‌న్ వస్తుందని చెప్పిన బాబు‌ కంటే పెద్ద సైకో ఎవరున్నారు రాష్ట్రంలో' అని తూర్పారపట్టారు.

'అన్నం పెట్టిన నిర్మాతపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన మరో సైకో బాలకృష్ణ. తర్వాత నిమ్సుకు వెళ్లి తనకు మతిస్థిమితం లేదంటూ సర్టిఫికెట్ తెచ్చుకుని కేసు‌ నుంచి బయటపడ్డారు. ఆ సర్టిఫికెట్ ప్రకారం ఆయనకు మతి‌స్థిమితం లేకపోతే ఎన్నికల్లో పోటీచేసే అర్హతలేదు. మతి స్థిమితం ఉంటే దొంగ సర్టిఫికెట్‌తో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆయనపై కేసు పెట్టాలి. తన అవినీతి ఆరోపణల మీద విచారణ జరగకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆ ప్రభుత్వాన్ని తన భుజాన మోశాడు చంద్రబాబు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే విప్ జారీ చేసి మరీ ప్రభుత్వానికి రక్షణ కవచంలా కాపాడారు. కాంగ్రె‌స్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చీలుస్తుంటే కొబ్బరికాయలా ముక్కలు చేసుకోండని విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు‌' అని నిప్పులు చెరిగారు.

'రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా, జపాన్‌లా చేస్తానని చెప్పుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నాడు. ఆయన మాటల్లో నిజం లేదు, వాగ్దానాల్లో నిజాయితీ లేదు. చంద్రబాబుకు అధికారమిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు. అప్పుడు రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ హామీ ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ తరం కాదని హేళన చేసిన బాబు ఈ రోజు నిస్సిగ్గుగా ఉచిత విద్యు‌త్ ఇస్తానని ఎలా చెప్పగలుగుతున్నాడు? అప్పట్లో రైతులను పురుగుల్లా చూసి, ఇప్పుడు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటూ అబద్ధాలు చెప్తున్నాడ‌'ని శ్రీమతి వైయస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు.

Back to Top