కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
శ్రద్ధాంజలి : వైఎస్ జగన్
28 Jul 2015 5:22 PM
మాజీ రాష్ట్రపతి, భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ అబ్దుల్ కలాం
గారి మరణ వార్త నన్ను కన్నీటి సముద్రంలో ముంచింది. అలాంటి
మహానుభావులు యుగానికొకరు మాత్రమే కనిపిస్తారు. వ్యక్తిగా ఆయన వందల
కోట్ల మందికి ఆత్మీయుడు, ఆరాధ్యుడు. ఈ దేశంలోని ప్రతీ ఒక్కరికీ ఆయన
అరమరికలు లేకుండా కలిసిపోయే మన ఇంటి మనిషి లాంటి వాడు. మన దేశాన్ని
అంతరిక్ష, క్షిపణి విజ్ఞానాల్లో మహోన్నత స్థానంలో నిలిపిన మహా
శాస్త్రజ్ఞుడు, దేశ భక్తుడు, నిరాడంబరుడు, నిలువెత్తు నిస్వార్థ పరుడు,
జ్ఞానాన్ని పంచుతూ చివరి క్షణాలను కూడా జాతికి అంకితం చేసిన మహా
మనీషి అబ్దుల్ కలాం గారు. అట్టడుగు స్థాయిలోని మత్స్యకార కుటుంబంలో
పుట్టి, పేపర్ బాయ్ గా పని చేసి..రాష్ట్రపతి పదవి వరకు ఎదిగి, ఆ
పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత ఉపాధ్యాయుడిగా మారిన కలాంగారి
జీవితంలో ప్రతీ అడుగు, ప్రతీ అణువు సందేశాత్మకం, స్ఫూర్తి దాయకం. 84
ఏళ్ల వయస్సులో కూడా భారత జాతిని తరువాతి తరం శాస్త్ర సాంకేతికతకు
సమాయత్తం చేస్తూ, మహోపాద్యాయుడిగా స్ఫూర్తి నింపుతూ, జ్ఞానాన్ని పంచుతూ
మరణించారాయన. రాష్ట్రపతి అయినా సామాన్యుడిగానే బతికారు. ఆ పదవి
నుంచి దిగిపోయిన తరువాత ఎవరికీ దక్కనంత గౌరవాన్ని పొందారు. ఈ
మహనీయుడు భారతీయ ఆత్మకు అసలు సిసలు ప్రతీక. భౌతికంగా మనల్ని
వదిలిపోయిన ఆ మహనీయుడికి శిరసు వంచి అభివాదం చేస్తున్నాను.
గారి మరణ వార్త నన్ను కన్నీటి సముద్రంలో ముంచింది. అలాంటి
మహానుభావులు యుగానికొకరు మాత్రమే కనిపిస్తారు. వ్యక్తిగా ఆయన వందల
కోట్ల మందికి ఆత్మీయుడు, ఆరాధ్యుడు. ఈ దేశంలోని ప్రతీ ఒక్కరికీ ఆయన
అరమరికలు లేకుండా కలిసిపోయే మన ఇంటి మనిషి లాంటి వాడు. మన దేశాన్ని
అంతరిక్ష, క్షిపణి విజ్ఞానాల్లో మహోన్నత స్థానంలో నిలిపిన మహా
శాస్త్రజ్ఞుడు, దేశ భక్తుడు, నిరాడంబరుడు, నిలువెత్తు నిస్వార్థ పరుడు,
జ్ఞానాన్ని పంచుతూ చివరి క్షణాలను కూడా జాతికి అంకితం చేసిన మహా
మనీషి అబ్దుల్ కలాం గారు. అట్టడుగు స్థాయిలోని మత్స్యకార కుటుంబంలో
పుట్టి, పేపర్ బాయ్ గా పని చేసి..రాష్ట్రపతి పదవి వరకు ఎదిగి, ఆ
పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత ఉపాధ్యాయుడిగా మారిన కలాంగారి
జీవితంలో ప్రతీ అడుగు, ప్రతీ అణువు సందేశాత్మకం, స్ఫూర్తి దాయకం. 84
ఏళ్ల వయస్సులో కూడా భారత జాతిని తరువాతి తరం శాస్త్ర సాంకేతికతకు
సమాయత్తం చేస్తూ, మహోపాద్యాయుడిగా స్ఫూర్తి నింపుతూ, జ్ఞానాన్ని పంచుతూ
మరణించారాయన. రాష్ట్రపతి అయినా సామాన్యుడిగానే బతికారు. ఆ పదవి
నుంచి దిగిపోయిన తరువాత ఎవరికీ దక్కనంత గౌరవాన్ని పొందారు. ఈ
మహనీయుడు భారతీయ ఆత్మకు అసలు సిసలు ప్రతీక. భౌతికంగా మనల్ని
వదిలిపోయిన ఆ మహనీయుడికి శిరసు వంచి అభివాదం చేస్తున్నాను.
- వైఎస్ జగన్