చంద్రబాబు, చింతమనేని ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాలి ఐదేళ్ల ప్రయాణం అద్భుతం ఆ ద్రోహం మీ బాబుదే రామోజీబాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?
షర్మిల పాదయాత్రకు నేడు విరామం
09 Dec 2012 10:17 AM
మహబూబ్నగర్, 9 డిసెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ఆదివారం విరామం ప్రకటించారు. అక్టోబర్ 18న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన శ్రీమతి షర్మిల వరుసగా 52 రోజులుగా నడుస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రజాప్రస్థానం చేస్తున్న శ్రీమతి షర్మిలకు ఆదివారం వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకోసం పాదయాత్రకు ఒక రోజు విరామం ఇచ్చారు. హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రి వైద్యుల బృందం శ్రీమతి షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది.
శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని జహంగీర్ పీర్ దర్గా (జెపి దర్గా) సమీపంలో శ్రీమతి షర్మిల బసచేశారు. ఆదివారం కూడా ఆమె జెపి దర్గా సమీపంలోని బసలోనే ఉంటారు. సోమవారం ఉదయం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుంది.