షర్మిల ఐదోరోజు పాదయాత్ర 16.8 కి.మీ.లు



హైదరాబాద్, 22 అక్టోబర్ 2012 : షర్మిల ఐదోరోజు పాదయాత్ర సోమవారం 16.8 కి.మీ.ల దూరం సాగుతుంది. నేడు లోపట్నూతల క్రాస్‌ నుండి ప్రారంభమయ్యే మరో ప్రజాప్రస్థానం 4.4 కి.మీ.లు సాగి కర్ణపాపయపల్లికి చేరుతుంది. ఆ తర్వాత అక్కడికి 3.6 కి.మీల దూరం ఉన్న వెలిదండ్లకు సాగుతుంది. వెలిదండ్ల నుండి నేర్జాంపల్లె వరకు 4.8 కి.మీ.లు, నేర్జాంపల్లె నుండి పార్నపల్లె వరకు 4 కి.మీ.లు పాదయాత్ర కొనసాగించి షర్మిల ఐదో రోజు విశ్రాంతి తీసుకుంటారు. మంగళవారం యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ షెడ్యూలును కూడా వైయస్ఆర్ సీపీ ప్రకటించింది.

Back to Top