కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
నేటి నుంచి విశాఖలో మరో ప్రజాప్రస్థానం
24 Jun 2013 10:39 AM
విశాఖపట్నం 24 జూన్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం సాయంత్రం విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించనుంది. నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరంమెట్ట వద్ద జిల్లాలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక్కడ శ్రీమతి షర్మిల మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2003లో రాజశేఖరరెడ్డిగారు ఇదే గ్రామంలో అడుగుపెట్టి విశాఖ జిల్లాలో ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభించారు. ఇక్కడి మూడు రోడ్ల జంక్షన్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం జిల్లాలో శ్రీమతి షర్మిల తొలి సభను కూడా పార్టీ నేతలు ఇక్కడే ఏర్పాటు చేశారు. డాక్టర్ వైయస్ఆర్ తనయకు ఘనస్వాగతం పలికి అక్కున చేర్చుకోవడానికి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. నర్సీపట్నం నియోజక వర్గం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి షర్మిలకు స్వాగతం పలికి, ఆమె అడుగులో అడుగువేయడానికి సిద్ధమయ్యారు. సోమవారం నాటి యాత్ర శరభవరం గ్రామం వరకు సాగుతుంది.