తుపాను బాధితులను ఆదుకుంటాం : పవార్‌ హామీ

‌ముంబై, 26 నవంబర్ 2013:

ఆంధ్రప్రదేశ్‌లో పై-లీన్, హెలెన్ తుపానుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రజల కడగండ్లను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడగట్టడంలో భాగంగా శ్రీ జగన్ సోమవారం మధ్యాహ్నం ముంబైలో పవార్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో తుపానుల వల్ల సంభవించిన నష్టాన్ని కూడా ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రైతుల దుస్థితి గురించి వివరాలను సావధానంగా తెలుసుకున్న పవార్ కేంద్రం నుంచి రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక సాయం అందజేయడానికి ప్రయత్నిస్తానని‌ శ్రీ జగన్‌కు హామీ ఇచ్చారు.

కాగా శ్రీ జగన్ మంగళవారం‌ తూర్పు గోదావరి జిల్లాలో తుపాను తాకిడికి గురై నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు తూర్పుగోదావరి, రెండవ రోజు బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయన నష్టాన్ని పరిశీలిస్తారు. బాధిత రైతాంగాన్ని పరామర్శిస్తారు.

తాజా వీడియోలు

Back to Top