అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
రాజన్నరాజ్యం కోసం కృషి చేద్దాం
26 Nov 2012 9:16 AM
అమరచింత:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కలలుగన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ ముందుకురావాలని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్వర్ణమ్మ అన్నారు. ఆదివారం అమరచింతలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించామని, ప్రస్తుతం షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రతిఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. మక్తల్ నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే వర్కటం జగన్నాథ్రెడ్డి, రఘురాం విష్ణువర్థన్రెడ్డి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. సమావేశంలో స్వర్ణమ్మ కుమారుడు శ్రీధర్, వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాజేశ్వర్రెడ్డి, నారాయణరెడ్డి, జుబేర్ అహ్మద్, మహేందర్, రంగనాథ్, జయరాములుతోపాటు పలువురు పాల్గొన్నారు.