సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేకారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులు
విలీనం వెనుక యెల్లో మీడియా కుట్ర
08 Sep 2012 2:19 AM
- పీటీఐ తన కథనాన్ని వెనక్కి తీసుకోవాలి
- దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలి
- లేదంటే చట్టపరమైన చర్యలు తప్పదు
హైదరాబాద్, 7 సెప్టెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలను వైయస్ విజయమ్మ తోసిపుచ్చలేదంటూ పీటీఐలో వచ్చిన వార్తా కథనాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ వార్త అత్యంత హేయమైనదిగా ఖండించింది. ఈ మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
‘విజయమ్మ వ్యాఖ్యలను యథాతథంగా ప్రచురిస్తే అభ్యంతరం లేదు. కానీ దానికి తనకు నచ్చినట్టుగా పీటీఐ భాష్యం చెప్పటం కుట్ర పూరితమైన వ్యవహారం’ అని తీవ్రంగా ఆక్షేపించింది. ఆ కథనాన్ని రాసిన పీటీఐ ప్రతినిధి వాస్తవాలను యథేచ్ఛగా వక్రీకరించాడని, ఆ వార్తా కథనం శీర్షికే దాన్ని ధ్రువీకరిస్తోందని అభిప్రాయపడింది. ‘వైయస్ఆర్సీపీ ఎన్నటికీ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రశ్నే తలెత్తదని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కచ్చితంగా తెలుసు. అలాంటప్పుడు ఇలాంటి కుట్రపూరిత కథనాలను ఎందుకు వండి వార్చిందో పీటీఐ సమీక్షించుకోవాలి’ అని కోరింది.
ఇదే అదనుగా ఎల్లో మీడియాలోని చంద్రబాబు చానళ్లు ఈ అసత్య కథనానికి విస్తృత స్థాయిలో ప్రాముఖ్యం ఇవ్వడం చూస్తుంటే, ఇది కుట్రపూరితమేనన్న తమ అభిప్రాయం సరైనదేనని ఎవరికైనా అర్థమవుతుందని పార్టీ పేర్కొంది. ఆ కథనాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, దుష్ప్రచారాన్ని ఆపాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ ఆ ప్రకటనలో హెచ్చరించింది.