<br/>విజయవాడ: ప్లాట్లిచ్చిన రైతులకు ఎలాంటి సాయం చేయకుండా చంద్రబాబు నిర్మిస్తున్న రాజధాని ఎవరి కోసమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రైతులు, మహిళలు ఎవరి సమస్యలు బాబుకు పట్టడం లేదని మండిపడ్డారు. హ్యాపీ అమరావతి అంటూ ఏవేవో కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.