పార్టీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు, లక్ష్మీపార్వతి

శ్రీకాకుళం :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యే‌లు, పలువురు నాయకులు చేరారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, పలాస ఎమ్మెల్యే జె. జగన్నాయకులు, పలువురు నాయకులు పార్టీలొ చేరారు. శ్రీకాకుళంలో ఆదివారం శ్రీ జగన్‌ నిర్వహించిన సమైక్య శంఖారావం యాత్ర వేదిక వేదికపైన ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి కూడా పార్టీ‌ సభ్యత్వం తీసుకున్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు.

సమైక్య శంఖారావం యాత్రగా వచ్చిన శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డికి శ్రీకాకుళంలో ఘనస్వాగతం లభించింది. శ్రీ జగన్ రాకను పురస్కరించుకుని ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. సభా ప్రాంగణం మొత్తం జనం సంద్రంగా మారిపోయింది.

Back to Top