హోదా కోసం ప్రాణాల‌ర్పిస్తే..ప‌ట్టించుకోరా?



చిత్తూరు: విభజన చట్టంలోని ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వకపోవడంతో పదుల సంఖ్యలో యువత ఆత్మత్యాగాలు చేశారు. అయితే ఆ కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. చనిపోయిన సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం చేస్తామన్న చంద్రబాబు సర్కార్‌ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో చేతికందిన కొడుకులను కోల్పొయిన కుటుంబాలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేసిన మునికోటి కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా తమ బాధలను వైయస్‌ జగన్‌కు వివరించారు.  మాకు ఇల్లు గడవం లేదని, సర్కార్‌ నుంచి రూపాయి కూడా సాయం అందలేదు. మునికోటి చనిపోయినప్పుడు అప్పటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సుగుణమ్మ వచ్చి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే రూ. 3లక్షల ఆర్థికసాయం చేశారని మునికోటి కుటుంబ సభ్యులు తెలిపారు.  బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వైయస్‌ జగన్‌ తప్పుపట్టారు. త్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాల‌ను ప్ర‌భుత్వం విస్మ‌రించ‌డం ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం అమాయ‌క యువ‌కులు ప్రాణ‌త్యాగం చేస్తే వారి కుటుంబాల‌ను ప‌ట్టించుకోరా అని మండిప‌డ్డారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని వారికి భరోసాకల్పించారు. వైయస్‌ జగన్‌ హామీతో మునికోటి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్ర‌

 
Back to Top