నవరత్నాలతో ప్రజల్లో హర్షాతిరేకాలు

చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే రోజా అన్నారు. జననేత వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు విశేషస్పందన లభిస్తుందన్నారు. చిత్తూరులో సాగుతున్న వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ..చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ జిల్లాలో పుట్టినందుకు అందరం సిగ్గుపడుతున్నామని విమర్శించారు. బాబు పుణ్యమా అని ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీలు మూత వేయించారు. జన్మభూమి కమిటీల పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన 600 హామీలు తుంగలో తొక్కారన్నారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుపై పీకల దాకా కోపంతో ఉన్నారన్నారు. ఇక్కడికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని, ఎన్నికలు వస్తున్నాయని అరకొరగా ఇల్లు మంజూరు చేస్తున్నారన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైయస్‌ జగన్‌ కూడా నవ రత్నాల ద్వారా అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబం ఒక్క మాట ఇస్తే మడమ తప్పరనిప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. పిల్లలను చదవించే బాధ్యత వైయస్‌ జగన్‌ తీసుకుంటున్నారన్నారు. మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. ఎక్కడపడితే అక్కడ చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని విమర్శించారు.
 

తాజా వీడియోలు

Back to Top