ప్రజలకు లాభం ఏమిటి..!

కమలాపురం) జన్మభూమి వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం ఏమీ లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్య కూడా పరిష్కారం దొరకలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో లక్షల అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని ఆయన వివరించారు. పాత సమస్యలు పరిష్కారం చేయకుండా కొత్తగా జన్మభూమి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రయోజనం లేదని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.

Back to Top