<strong>గుంటూరు, 18 మార్చి 2013:</strong> శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం 94వ రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఆమె గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మంచాల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. శ్రీమతి షర్మిల ఈ రోజు మంచాల, బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు, వెల్లలూరు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అనంతరం ఆమె తొట్టెంపూడి, మామిళ్లపల్లి, మోదుకూరు మీదుగా రాత్రి బసకు చేరుకుంటారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు.