ఆత్మహత్యకు ముఖ్యమంత్రే కారణం

కర్నూలు
: నందికొట్కూరు నియోజకవర్గంలోని కేసీ కెనాల్ ఆయకట్టు భూములకు సాగు నీరు
ఇవ్వకుంటే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. కర్నూలు
జిల్లా కేంద్రంలో దాదాపు 200 మంది రైతులు జల వనరుల శాఖ ఎస్‌ఈ ఛాంబర్‌ను
చుట్టుముట్టారు.
 
ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు
మార్చి దాకా నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఆత్మహత్యలకు
ముఖ్యమంత్రి, అధికారులే కారణమంటూ లేఖలు రాసి, అక్కడే ప్రాణాలు తీసుకుంటామని
హెచ్చరించారు. సాగునీరివ్వలేమని  ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు  నిస్సహాయత
వ్యక్తం చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top