మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూత
27 Jul 2015 12:50 PM
దేశం గర్వించదగిన శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూశారు. తనకు ఎంతో ఇష్టమైన విద్యార్థులకు బోధన అందిస్తుండగానే ఆయన సెలవు తీసుకొన్నారు. షిల్లాంగ్ లోని ఐఐఎమ్ లో ఆయన ఈ సాయంత్రం గెస్ట్ లెక్చర్ ఇస్తున్నారు. ఆ వేదిక మీద ప్రసంగిస్తుండగానే ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు లోనై కుప్పకూలారు. ఆ వెంటనే ఆయన్ని సైనిక బలగాలు స్తానిక ఆసుపత్రి కి తీసుకొని వెళ్లారు. అక్కడ ఐ సీ యూ లో చికిత్స అందిస్తుండగా కన్ను మూశారు.
తమిళనాడులోని రామేశ్వరంలో నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రికి సాయం చేస్తూ, చిన్న చితక పనులు చేస్తూ స్వయం శక్తితో ఆయన ఇంజనీరింగ్ చదువుకొన్నారు. తర్వాత సైనిక బలగాలకు సేవలు అందించే డిఫెన్స్ ల్యాబరేటరీల్లో సుదీర్ఘ కాలం పని చేశారు. భారతీయ క్షిపణి పితామహుడుగా ఆయన పేరు గాంచారు. తర్వాత ఆయన్ని భారత రాష్ట్రపతి పదవి వరించింది. ఐదేళ్ల పాటు రాష్ట్రపతిగా వివాదాలకు దూరంగా సేవలు అందించారు. తర్వాత కాలంలో ఆయన అనేక విశ్వ విద్యాలయాలకు అతిథి అద్యాపకుడిగా బోదనలు అందిస్తున్నారు.
చిన్నారులను ఎక్కువగా ఇష్టపడే అబ్దుల్ కలాం అనేక పాఠ శాలల్ని సందర్శించారు. భారతీయ సంస్కృతిని అమితంగా ప్రేమించే కలాం..అనేక రంగాల్లో నైపుణ్యం గడించారు. చిన్నారులు ఎక్కడ ఉన్నా ఉత్సాహంగా పలకరించి వారిని ప్రోత్సహించేవారు.