7న బైరెడ్డి సిద్ధార్ద్‌ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 

కర్నూలు : ప్ర‌భుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. రాష్ట్రం కోసం పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా  నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ద్‌ రెడ్డి ఈ నెల 7వ తేదీన వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

 సిద్ధార్థ్‌రెడ్డి మీడియా మాట్లాడుతూ..  రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి కోరికే మేరకు వైయ‌స్ఆర్‌సీపీ లో చేరుతున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధిస్తున్నారన్నారు. కనీసం నియోజకవర్గంలో ప్రజలకు  పింఛ‌న్లు కూడా రావడం లేదన్నారు.  కాగా, ఇటీవ‌ల బీజేపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి కూడా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. దీంతో జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీకి ఎదురు లేకుండా పోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజ‌యం సాధిస్తుంద‌ని పార్టీ శ్రేణులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Back to Top