ఉమా..దమ్ముంటే చర్చకు రా

దేవినేని ప్రగల్భాలు మానుకో
సొంత నియోజకవర్గానికి చుక్కనీరివ్వని నీవు..
వైఎస్ జగన్ సొంతూరికి నీరిచ్చానంటావా
దమ్ముంటే చర్చకు రావాలని సవాల్

హైదరాబాద్ః
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు
చెరిగారు. చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమలు జలవనరుల శాఖను ధనవనరుల శాఖగా
మార్చుకున్నారని ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీరు
అందించలేని దేవినేని ఉమ...వైఎస్ జగన్ సొంతూరికి నీళ్లిచ్చానంటూ ప్రగల్భాలు
పలకడం మానుకోవాలని హితవు పలికారు. రైతులు నిలదీస్తారనే దేవినేని
నియోజకవర్గంలో కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.  

చంద్రబాబు,
దేవినేని ఉమలు రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారారని జోగి ధ్వజమెత్తారు.
పట్టిసీమలో కమీషన్లు కొట్టేసిన  బాబు, ఉమల పుణ్యం వల్లే వందేళ్ల చరిత్రలో
ఎన్నడూ లేనంతగా కృష్ణా, గోదావరి డెల్టాలు ఎండిపోయాయన్నారు. ఇప్పటికే ఓ
సీజన్  పంటలన్నీ ఎడిపోయాయి. రెండో పంట వేసుకోవాలో వద్దో చెప్పలేని
పరిస్థితుల్లో చంద్రబాబు సర్కార్ ఉందని మండిపడ్డారు. టీడీపీ సర్కార్
పరిపాలన ఘోరంగా తయారైందని..రైతులు విలవిలలాడుతున్నారని వాపోయారు. చుక్కనీరు
ఇవ్వకుండా ప్రగల్ఫాలు పలుకుతున్న దేవినేని ఉమకు రైతులు ఉరివేయడం
ఖాయమన్నారు. 

ఎన్నికల్లో డబ్బుల కట్టలు పంచిన
తాబేదారులకు ...చంద్రబాబు వందల కోట్లు ఎస్టిమేట్ కాస్ట్ పెంచి లబ్ది
చేకూరుస్తున్నారని రమేష్ ధ్వజమెత్తారు. 2018 కల్లా పోలవరం పూర్తిచేస్తామని
పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి
పచ్చప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రంతో మాట్లాడలేదన్నారు. పోలవరంపై ఎంత ఖర్చు
పెట్టారో చూపించమని కేంద్రం అడిగితే..దానిపై సమాధానం చెప్పకుండా నాటకాలు
ఆడుతున్నారని మండిపడ్డారు. ఇలా ఎంత కాలం ప్రజలను మోసగిస్తారని ఫైరయ్యారు.
సాగు, తాగు నీటి విషయంలో గానీ...పోలవరం, పట్టిసీమపై గానే ...దమ్మూ, ధైర్యం
ఉంటే బహిరంగ చర్చకు రావాలని దేవినేనికి జోగి రమేష్ సవాల్ విసిరారు.  

రైతులు
స్వచ్ఛందంగా  భూములిచ్చారని, వాళ్ల కాళ్లకు పూజిస్తానన్న
చంద్రబాబు..వారిని ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. రాజధానిలో ఒక్క
ఇటుక కదలీయను, ఒక్క ఇళ్లు కూడా తీసేయనని చెప్పిన చంద్రబాబు ..రోడ్లు,
స్కైవేలని చెప్పి ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయాలని  చూస్తున్నారని ధ్వజమెత్తారు.
అలా చేస్తే రైతులు చంద్రబాబును రాళ్లతో కొడతారన్నారు. రైతులు తిరగబడతారనే
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తప్పించుకు తిరుగుతున్నారని
తూర్పురాబట్టారు.  
Back to Top