ఢిల్లీ: ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం హస్తిన వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పోరాటం కొనసాగుతూనే ఉంది. హోదా కోసం ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజు జేడీయూ అధ్యక్షుడు శరద్యాదవ్ సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని ఆయన విమర్శించారు.