<p style="" margin-bottom:0in="">హైదరాబాద్) రాజ్యసభ ఎంపీ గా ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.<p style="" margin-bottom:0in="">ఉత్తరాంధ్ర కు చెందిన పలువురు పార్టీ నాయకులు ఆయన్ని నివాసంలో కలుసుకొన్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ఆ జిల్లా నాయకులు కలిశారు. తర్వాత విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, ఇతర నాయకులు కలిశారు. శ్రమ తీసుకొని అభినందించేందుకు వచ్చిన నాయకులు అందరికీ విజయసాయిరెడ్డి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. </p><p style="" margin-bottom:0in=""><br/></p></p>