అలాంటి స్పీకర్ మాకొద్దు

గుంటూరు :
టీడీపీ సర్కార్ బెదిరింపులకు భయపడి పారిపోయే వాళ్లు ఎవరూ లేరని
వైఎస్సార్సీపీ నరసారావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
అన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తున్న
తమపై...తప్పుడు కేసులు బనాయిస్తూ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ లకు
పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన
నియోజకవర్గానికి పరిమితమైతే బాగుంటుందని హితవు పలికారు. శాసనసభ్యుల హక్కులు
కాలరాసే స్పీకర్ తమకు వద్దన్నారు. 

ప్రభుత్వం
గానీ, పోలీసులు గానీ ఎక్కడ ఇబ్బందులు సృష్టించినా  వైఎస్సార్సీపీ పోరాటాలు
చేయడానికి సిద్ధంగా ఉందని  శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ
అరాచకాలను అడ్డుకుంటామన్నారు. తాను ఎవరినీ దూషించకపోయినా
..ఉద్దేశ్యపూర్వకంగానే ఎమ్మార్వోను బెదిరించి బలవంతంగా తనపై 353 కేసు
పెట్టించారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీ
చార్జ్ చేసి గాయపర్చారని, ఆడవాళ్లను వివస్త్రలను చేశారని మండిపడ్డారు.
మనిషి మంచితనంతో సమాధానం చెప్పుకోవాలి గానీ బెదిరిస్తే ఎవరూ బయపడరన్నారు.
 ఎవరు తప్పు చేశారో వారందరికీ సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు.
Back to Top