భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు
రైతులకు బేడీలు వేస్తారా..?
11 May 2017 2:39 PM
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం దేశ రైతాంగాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి పోలీసులు కోర్టుకు తీసుకెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడం దుర్మార్గపు చర్య అని ఆయన మండిపడ్డారు. రైతులు ఏమైనా తీవ్రవాదులా..? లేక దేశ ద్రోహులా..? అని కేసీఆర్ను ప్రశ్నించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం రైతుల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, దీనికి కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.