అనుమతులు రద్దు చేయాలి

న్యూఢిల్లీ:
అమరావతి నిర్మాణంపై మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త ఈఏఎస్ శర్మ
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. అమరావతి నిర్మాణానికి ఇచ్చిన
పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ ఆయన ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు
చేశారు. ఈ పిటిషన్ లో యూనియన్ ఆఫ్ ఇండియా, కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్
అథారిటీ, రాష్ట్ర అటవీశాఖ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ను ప్రతివాదులుగా
చేర్చారు.

శర్మ తన పిటిషన్ లో బహుళ పంటలు పండే
ప్రాంతంతో పాటు సున్నితమైన పర్యావరణ ప్రాంతంలో విమానాలకు అనుమతికి రాష్ట్ర
అథారిటీ లేదని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గుంటూరు
జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భారీ భవనాలను నిర్మించడం వల్ల కృష్ణా రివర్ బెడ్
కు ముప్పు పొంచివుందని, అంతే కాకుండా  అమరావతి నిర్మాణ అనుమతులు ...నేషనల్
గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.

గతంలో
కూడా  పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ శ్రీమన్నారాయణ అనే
వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన
ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఆర్డీఏ, కేంద్ర పర్యావరణ శాఖలకు
నోటీసులు జారీ చేసింది.
Back to Top