బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
కంచనపల్లిలో మహానేత విగ్రహం ఆవిష్కరణ
03 Jul 2013 12:55 PM
వరంగల్, 3 జూలై 2013:
వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శ్రీమతి వైయస్ విజయమ్మ బుధవారం ఉదయం ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న శ్రీమతి విజయమ్మ మార్గమధ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పార్టీ నేతలు కొండా సురేఖ దంపతులు కూడా ఉన్నారు.
కాగా, మధ్యాహ్నం వరంగల్లోని అభిరాం గార్డెన్సులో జరిగే పార్టీ జిల్లా స్థాయి పంచాయతీరాజ్ సదస్సులో శ్రీమతి విజయమ్మ పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి శ్రీమతి విజయమ్మ ప్రసంగిస్తారు. శ్రీమతి విజయమ్మ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆమెకు ఘనస్వాగతం పలుకుతూ ప్రధాన సెంటర్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.